Sunday 11 December 2011

కులపతి - పూర్వ గాధ


‘అష్టాదశపురాణేషు వ్యాసేన కథితం ద్వయమ్,
పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనమ్’


పరోపకారమే పుణ్యము. పరపీడనమే పాపము.
ఈ సూక్తి ప్రత్యణువున జీర్ణించి అక్షరాల పరోపకారమే
పాటించిన మహామహులు, ఏ కాలమువారైన ఏదేశము
వారైన సార్వకాలికముగా - సార్వదేశికముగా పూజ్యు
లనుటలో అత్యుక్తి లేదు. అడిగినది లేదనక సర్వస్వము లాఁతి
వారికయి ధారవోయు వదాన్య శిరోమణు లుండవచ్చును;
పరాక్రమైకధనులై లోకారాధనమే పరమ ధ్యేయముగా
భావించి కీర్తి గడించిన వీరాధివీరులు వెలయవచ్చును;
రాజకీయములలో ఆరితేఱి మానవసేవయే మాధవసేవగా
బ్రతుకనేర్చిన భవ్యజీవులు ఉద్భవింపవచ్చును.
కాని, విద్యాధనమింత పంచియిచ్చి అజ్‘జ్ఞానాంధకారములో
మ్రగ్గిన మానవులకు విజ్ఞానజ్యొతి వెలయించి దేశము
నుద్ధరించినవారి పుణ్యమే పుణ్యము.

లోకమాన్యుఁడు బాలగంగాధరుఁడు - పూజ్యుఁడు
మదనమోహనమాలవ్యా - పాంచాలకేసరి లాలా లజపతి
రాయి, ఆ శ్రేణిలో అగ్రిమస్థాన మందుకొన్న మహామహులు.

..............................................................................

కులపతి పూర్వగాథ                        2

విదేశవిద్యల మోజులో తికమకలై స్వస్థానవేషభాషాదికములు
మఱచి అస్వతంత్రమై అణఁగిపోయిన భారతజాతిని ప్రాచ్యమునకు
నడపించి జవసత్వములు కూర్చిన మహామహులు వారు.
వారి త్రోవలో మెలఁగి విద్యాధన మగ్గలముగా గడించి,
గడించినదానిని లోకులకుఁ బంచియిచ్చుటయే పరమార్ధముగా
భావించిన యొకానొక భవ్యమూర్తియే ఈ కథకు నాయకుడు.

ఆతఁడు తెలుఁగు గడ్డలో ఉద్భవించిన ఒకానొక ఆణిముత్తెము.
తెలుఁగు దేశము లెస్సగా నోఁచిన నోములపంట. పట్టాభివంటి
దిగ్దంతులు పుట్టి పెరిఁగిన బందరుపరగణాలో పేరు వొందిన
మనీషి. దబ్బపండువంటి మేనిచాయ. విద్యావైదుష్యము
వెలిఁబుచ్చు తిన్నని నెన్నుదురు. ఆత్మీయతను గోలుపోవని
గోష్పాదమువంటి కేశపాశము. ప్రశాంతిని వెలిఁగ్రక్కు విశాలమైన
కందోయి. నెమ్మొగమునకు వన్నె తెచ్చు కోటేరువంటి ముక్కు.
మూర్తీభవించిన సారస్వతము. జాతీయతను స్పురింపఁజేయు
వేషము. శైశవమునుండియు అభిజనము పిలుచుకొన్న
పేరు వరదయ్య. పెరిఁగి పెద్దయై లోక వ్యవహారములో
‘వరదాచార్యులుగా’పరిణమించిరి. విద్యావయోరూపములలో
ఆరమ్రుగ్గిన ఈ పండును విద్వల్లోకము మోజుపడి
‘కులపతి’ యని పిలుచుకొని గారవించెను.

తెలుఁగుబిడ్డయైన రామానుజుఁడే విశిష్టాద్వైతమత ప్రవర్తకుఁడయి
రామానుజాచార్యు లయ్యెను. తెలుఁగు దేశమునుండి వలసపోయిన
రామానుజకుటుంబమువారి సంప్రదాయములే తెలుఁగు దేశములో


............................................................

కులపతి పూర్వగాథ                           3


 మఱల వలసగా వచ్చుటఁజేసికాఁబోలు ఈ దేశములో
 ఆంధ్రవైష్ణవు లన్న యొక శాఖ యేర్పడినది.
ఉభయవేదముల ప్రసక్తి యుండుటఁజేసి యా శాఖ
వారు - ‘ఉభయ వేదాంతప్రవర్తకు’లుగా వ్యవహృతులైరి.
వారిలోను విశిష్య - తిరుమలనుండి సాగిన యీ
శాఖవారు శ్రీమత్తిరుమలవారైరి. సంప్రదాయమును బట్టి
మొన్న మొన్నటి వఱకు -ఈ వైష్ణవవంశ్యులు -
ఏఁడాదిలోఁ గొంతకాలము శిష్యసంచారము వెడలి
జ్ఞానోపదేశములో మతప్రచారములోఁ గాలక్షేపము
చేసెడివారు. ఈ వంశములో అనూచానముగ వచ్చు
గురుశిష్యసంప్రదాయమే నేఁడు కాలానుగుణముగ
పరిణామ మంది వరదాచార్యులవారిలో విశిష్టత
గడించుకొన్నది.

శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ నరసింహాచార్యులవారు
చిట్టిగూడూరులో సంపన్నగృహస్థు. ఆయన మొదటి
భార్య లక్ష్మీనరసమ్మ తొలిబిడ్డయే - ఈ వరదాచార్యులు.
రెండవ సంతానము - అలమేలు మంగతాయారమ్మ.
‘ద్వితీయమున’కొక్కర్తుకయేబిడ్డ. ఆమె పేరు
రాఘవమ్మ. ఈ చరిత్రలో ఈ గాథలో - కథానాయకుని
తో పాటు గణుతి గాంచిన పూజ్యురాలు - ఆండాలమ్మ.
ఆమెయే - ఆయనకు సవతి తల్లి. వరదయ్యా యని
ఆమె, యెదిగిన యా సవతి బిడ్డను నోరారఁ
బిలుచునప్పుడు - వరదన్నయ్య యని యా ముద్దు
చెల్లెలు రాఘవమ్మ, అన్నయ్యను బిలుచునప్పుడు
లాఁతివారమైన మాకే యొకానొక మహానంద
ముద్భవించెడిది.


....................................................................

కులపతి పూర్వగాథ                         4

ఆండాలమ్మవరదయ్యలలొ, వరదయ్య -రాఘవమ్మలలో
అనిర్వచనీయమైన యొకానొక యభేదాధ్యవసాయమే
స్ఫురించెడిది.

నందననామసంవత్సర శ్రావణ శుక్ల దశమినాఁడు
వరదయ్య జన్మించెను. సర్వలక్షణలక్షితమైన యా సంతాన
మును జూచుకొని యా కుటుంబ మెంతో సంబరపడెను.
పైగా -ఆయన లక్ష్మీపుత్త్రుఁడాయె, అల్లారు ముద్దుగాఁ బెరుగు
చున్న యా బిడ్డకు ప్రాధమికవిద్యలో వ్యాసంగము పూర్తి
చేయించిరి. తండ్రియు మేనమామయు సంస్కృతాంధ్రములు
నేర్పిరి. వరదయ్యకుఁ దొమ్మిదేండ్ల ప్రాయములోనే తల్లి
పరమపదించుటఁజేసి సవతి తల్లి - ఆండాలమ్మయే
సర్వభారము వహించెను. నాఁటినుండి యాయన
హృదయములో ఆమె మూర్తియే మాతృపీఠ మధిష్టించి
హత్తుకొనిపోయెను. ఏకైక పుత్త్రుఁడైన యా దశలో
సిరిసంపదలుతాండవించు ఆ యింటిలో తల్లిలేనిబిడ్డ
యన్నగారాము పిల్లవాని నేమైనఁ జేయవచ్చును. పైగా
లక్ష్మీసరస్వతులకుఁ బొత్తు కుదరనేరదన్న సూక్తియు
ముప్పాతిక మువ్వీసము - అక్షరాల నిజమగుట
లోకములోఁ జూతుము. దండిగా సిరిసంపదలు తాండ
వించు నింటిలో విద్యా జ్యోతి వెలుంగుటవింతలలో వింత.
చదువు సంధ్యలు చక్కఁగా సాగుటకు వీలున్నచోట
గ్రాసవాసములు చూచుటకే కాలము చాలదు. ఎవ్వరో
రవీంద్రుని జహ్వరిలాలువంటివారిని విడిచినచో లోకములోఁ
దలయెత్తిన యుత్తమవ్యక్తు లెందఱెందఱో శైశవములోఁ
పేదరికము చవిచూచినవారే. వరదయ్య అట్లుగాక
కలిమిబలిమిలో మునిఁగినను జదువులలో అంతరాయములు



.......................................................


 
కులపతి పూర్వగాథ                      5

లేక వినయసంపదలు పెంచుకొంచు హృద్యమైన విద్యకే
పరవళ్ళు త్రొక్కెను. దేశ పరిస్థితులను బట్టి రాజభాష గా
ఈ దేశములో ‘తిష్ట’ వేసిన ఆంగ్లముకోసమే వరదయ్యను
బందరు పంపిరి.

బందరులో చదువులు చక్కఁగా సాగుచున్నప్పుడే
పరీక్షార్థమో యన్నట్లు వరదయ్య జనకులు గతించిరి.
ఇంటిలోఁ జూడవలసిన వ్యవహారమా కావలసినంత.
పాడిపంటలతో గొడ్డుగోదలతో కలకలలాడు సంసారము పై
పరామరిక లేనిచో కాసులే గవ్వలుగా మాఱుటలో వింత
యేముండును? ఆ యింటి మంచిసెబ్బరల కన్నింటికి
మాతులుఁడైన రంగరామానుచార్యులే మూల
స్తంభమాయెను. ఆయన గ్రామమా దగ్గిఱిలోని గూడూరు.
ఆయన లౌకిక ప్రజ్ఞాధురీణుడు; పేరుగన్న సంపన్న గృహస్థు.
వ్యవసాయ గోష్ఠిలోఆరితేఱిన చేయి. సంస్కృతాంధ్రముల
సారస్యము చక్కఁగా నెఱిఁగిన మనీషి. కొండమీఁదికోఁతినేని
రప్పింపఁగల వ్యవహారదక్షుడు. బంధుసముద్రుడు. ఆయన
అంతవాఁడు గావుననే రెండు - ఊళ్ళలోని యీ రెండు
సంసారములను గంటికి రెప్పవోలెఁ గాపాడనేర్చెను. ఆయన
బిడ్డ లక్ష్మమ్మయే మేనల్లున కర్ధాంగలక్ష్మి. తల్లికి మాఱుగాఁ
దానే తల్లియై -ఆండాలమ్మ యిల్లు తీర్చుచుండగాఁ దండ్రికి
మాఱుగా మేనమామయే యండయై దండయై కనిపెట్టి
యుండఁగా వరదయ్య విద్యావ్యాసంగమునకు అంతరాయము
లవతరింపకుండుట ఆయన సుకృతవిశేషమే కావచ్చును.



..............................................


 
కులపతి పూర్వగాథ                                 6

అయినను - ప్రాక్తనజన్మవిద్యల కీ లౌకికవిఘ్నము
లొక విఘ్నములా!

అప్పటికే యీ దేశములో స్వస్థానవేషభాషల గౌరవము
సడలిపోయినది. ఈ దేశమును మనము కైవసము
చేసికోవలెనన్న మన మాతృభాషనే వీండ్రకు నూఱిపోయ
వలెనని మెకాలెదొర పలికిన పలుకు లక్షరాల సత్యములే
యైనవి. దాస్యములో మునిఁగిన యీ దేశములో - ఇంగ్లీషులో
నాలుగు ముక్క లంటినవానికే యేదోనొక యుద్యోగము
లభించెడిది. ఆ యుద్యోగమే యొక మహాభాగ్యముగా
భావించి దానికై యెగఁబడెడి రోజులు దాపరించినవి.
తరతరాలుగాఁ జదువు లొంటఁబట్టిన జాతులు - ఆర్థిక
ప్రపత్తి కాశించి ఆంగ్లేయ భాషకే యఱ్ఱులు చాఁచిరి.
ఆ భాషలోఁ జొఱవ యేర్పడిననాఁడు - అందలి మెఱుఁగులతో
పాటు తఱుగులుసైతము సంక్రమించెను. క్రొత్త యొకవింత
యన్నట్లు - ఆ వేషభాషలలోని వినూత్నత యాకర్షక
మాయెను. కేవలము మాతృభాషలే గాక పవిత్రమైన
గీర్వాణము సైతము నీరసస్థితికి వచ్చెను. ఒకవేళ - అవి
చదివినను ‘పరపతి’తఱుగై పోయెను. కాసులు గలవాఁడే
రాజన్న ధోరణిలో - పాశ్చాత్యప్రాభవమే సర్వత్ర పెరిఁగిపోయెను.
ఈ తీరు ధోరణిలో దేశ్యభాషలు దెబ్బతినుట రాజకీయ
నాయకులు గుర్తించి యాందోళనము చేసిరి. అప్పుడు
రాజభాషయగు  నాంగ్లమునకు దేశ్యభాష లంగములుగాఁ
జేర్చి ఆంగ్లకళాశాలలోఁ గొన్ని సదుపాయము లేర్పఱిచిరి.




..................................
 


 కులపతి పూర్వగాథ                                 7


 గురుకులాశ్రయ ధోరణిలోఁ జదువులు సాగవయ్యెను. ఆ మార్గములే
మృగ్యము లయ్యెను. ఒకవేళ శ్రమపడి సర్వశాస్త్రపారంగతులైనను
లౌకికముగా వారికి మన్ననయే లేదు; గ్రాసవాసములలోఁ
గుదిరికయే చిక్కదు.

ఆంగ్లభాషకై మోజుపడి ముందునకుఁ బోవలెనన్న
చేతిలో కాసులు గలగలలాడవలెను. అప్పుడు పెద్దచదువులు
కావలెనన్న రాజధానీనగరమునకుఁ బోవలయును. ఆ రోజు
లలో దక్షినాపథమున కంతకు - చెన్ననగరమే ప్రధానపత్త
నము. చెన్నప్ప తెలుఁగువాఁడైనను చెన్నపట్టణము తెలుఁగు
పట్టణమైనను నాలుగు మూలలనుండి నాలుగు జాతులు వచ్చి
పట్టణములోఁ జొచ్చిరి. పైగా - ఆ పట్టణము తెలుగునేలకు
విసిరివేసినట్టులు ఒక యంచులో నుండుటఁజేసి అక్కడి చదు
వులకై తెలుఁగువారు హెచ్చుగాఁ బోలేకపోయిరి. ఆ దశలో
చెన్ననగరములో పేరుమోసిన విద్యాసంస్థ, రాజధానీకళాశాల.
దానిలోఁ జదువవలెనన్న పేదసాదులకు సాధ్యమే కాదు.
మేధావులైన సంపన్నులకే - ఆ కళాశాలలో అవకాశములు
దొరకును.

బందరు చదువులు ముగిసిన పిదప వరదాచార్యులను
చెన్నపురికిఁ బంపిరి. ప్రెసిడెన్సీ కాలేజిలోవిద్యార్థిగా
నుండవలెనన్న - ఆ తాహతు వేఱు. ఆ దర్పము -
ఆ వేషము - ఆ కర్చువెచ్చములు ప్రత్యేకములుగా భాసించును.
కేవలము పల్లెటూరిలోఁ బుట్టిపెరిఁగినను నాలుగుముక్క
లింగ్లీషులో ఎంగిలి చేసినమాత్రాన - అవతారమే మాఱిపోవును.


౭ 

.............................................................................................


 కులపతి పూర్వగాథ                     8

చిట్టిగూడూరులోని వరదయ్యవేషమే చెన్ననగరములో సైతము
కానవచ్చును. పల్లెటూరిబడిలో - ఆయన వేసికొన్న
దుస్తులే ప్రెసిడెన్సికాలేజిలోఁగూడ - అనుస్యూతమాయెను.
ప్రాయికగా లోకములోఁ గొందఱి కింటిలో నీఁగలమోతయు
బయటఁ బల్లకీమోతయు సాజమైపోవును. తల్లిదండ్రులు
చెమట యోడ్చి నెత్తురు పిండి గ్రాసవాసములకే జరుగక
గాసివొందుచు చీమవోలెఁ గూడఁబెట్టి యల్లారుముద్దుగాఁ
బంపుకొన్న యా సొమ్మును గవ్వలుగా గ్రచ్చలుగాఁ
గర్చువెట్టు విద్యార్థు లెందఱెందఱో యుందురు. ఒకప్పు
డింగ్లండువంటి లాఁతిదేశములలో చదువులకోసమై వెళ్ళిన
భారతీయయువకులను జూచి లక్షాధికారుల బిడ్డలనియు
జమీందారుల సంతానమనియు అచ్చటివారు ముచ్చటించు
కొనెడివారఁట. అనఁగా వారి యూహలకు మన యువకుల
పోకడలే కారణమై యుండుటలో ఆశ్చర్యములేదు. ఇట్టి
వాతావరణము బాల్యమునుండియు వరదయ్య తత్త్వమునకే
సరిపడదాయె. ఇంటిలోఁ దల్లిదండ్రుల సన్నిధిని మన
మెట్లుందుమో వీధిలో సైతమట్లే నిరాడంబరముగా నుండ
వలెననియాయన తీర్పు. సమాజము కోసమై యెగిరిపడుట
వంతునకు గంతువేయుట - ఆయనకు రోఁత. తాత త్రవ్వించిన
నూయి కదాయని దానిలో ఊరిన యుప్పునీరే త్రాగవలెనని


..............................................

  కులపతి పూర్వగాథ                     9

 యాయన సిద్ధాంతంకాదు. నవ్యమైనను మంచి యున్నచో
గ్రహింపవలెనని ప్రాచ్యమైనను రోఁతయైనచో మానవలెనని
ఆయన తత్వము. ఆకుఁజెప్పులు వేసికొని - ఆ జుట్టుముడితో -
ఆయూర్ధ్వపుండ్రములతో - చొక్కా ధోవతులతో ప్రెసిడెన్సీకాలేజి
విద్యార్థిగాఁబోవు వరదయ్యలో విశేషము లేకపోలేదు.
ఆడంబరదృష్టి కది విడ్డూరమే కన్పించినను తాత్త్విక
దృష్టిలోఁ బరిశీలింప - అదియే స్థిరమై శ్రేయము నిచ్చును.
విద్యార్థియైన వరదయ్య మానసికతత్త్వమే - విద్యాధికులయిన
వరదాచార్యులవారిలో నేటికినీ జూతుము.

అప్పటి చదువులలో - అదే పెద్దచదువు. ఆనర్స్ క్లాసు,
అనఁగా-ఒక మత్తేభమును వాకిటఁ గట్టివేసినట్లే. అది
చక్కఁగా సాగి గట్టెక్కెనా పెరటిలో కల్పతరువు నాఁటినట్లే.
తల్లియుఁ దండ్రియు లేని యీ పసితనములో విసిరివేసి
నట్లున్న మదరాసులో నివాసము తప్పదాయెను. మేనల్లుఁడు
అల్లుఁడైన యీ పిల్లవాడు దూరదేశాన ఏమైన యిబ్బంది
పడునేమోయన్న బెంగచే రంగరామానుజాచార్యులు
కంట వత్తిడికొని కావలసినవి పంపుచుండును. సర్వ
వ్యవహారముల భారము మామయ్య బుజములమీఁద
వేసి యింటి పెత్తనమంతయు - ఆండాలమ్మ కప్పగించి
యిల్లాలు లక్ష్మమ్మను - అనుఁగుఁజెల్లెండ్ర నిర్వురను
విడిచి సర్వసంగపరిత్యాగి యగు యోగివోలె మదరాసులో
విద్యార్థిగా కాలము గడపెను.

 ౯

..................................


     కులపతి పూర్వగాథ                10

అప్పటి ప్రెసిడెన్సీకాలేజిలో పేరొపొందిన మహామహు
లిర్వురు -ఈ విద్యార్థి వరదయ్యకు అత్యంతాప్తులైన
ఆచార్యులైరి. వారిలో ఒకరు మహామహోపాధ్యాయులైన
కుప్పుస్వామిశాస్త్రివర్యులు. ఆయన విద్యావాచస్పతులై
ప్రాచ్యములో సర్వ శాస్త్రముల లోఁతుపాతులు తడవిచూచి
యం,ఏ పట్టభద్రత గడించిన దిగ్దంతులు. రెండవ
మహాపండితులు ప్రొఫెసరు రంగాచార్యులవారు. ఈ
యిరువురు వారి వారి అభిమానశాఖలలో ఇతరులకుఁ
దీసిపోవని ఉద్దండులు. వీరి శిష్యకోటిలో వరదయ్య,
ముఖ్యులలో ముఖ్యుఁడై మీమాంసారహస్యములను
వ్యాకరణాదికమును లెస్సగా నేర్చెను.

ఆ క్లాసులో ఆయనకు సర్వశ్రీ - తణికెళ్ళ వీరభద్రుడు
కందాళ హనుమంతరావుపంతులు వంటి ఉద్దండ
పండితులు సహాధ్యాయులట. ఆంగ్లభాషాపాండితి
గడించిన ఆంధ్రులలో వీరభద్రుఁ డొక పేరుమోసిన ప్రొఫెసరు.
ఆంగ్లపాఠశాలలలో అత్యున్నతశ్రేణిలోఁ జేరిన ప్రధానో
పాధ్యాయులలో కందాళవారు - ఒకరు. ఆచార్యులవారి
సహాధ్యాయులైన కందాళవారికి ఈ ‘రచయిత’
సహోపాధ్యాయుఁడుగా పనిచేయుట - ఆ తరుణములో
ఆచార్యులవారి విశిష్టతను ఆయన ద్వారా పదేపదే
వినుట కాకతాళీయముగా లభించిన భాగ్యముగా
ఈ రచయిత భావించుచుండును.

పాఠ్యగ్రంధములే బట్టీపెట్టి పరీక్షలో గట్టెక్కవలెనన్న
కాంక్షతో కాలక్షేపము సేయక ప్రత్యేకకృషి చేసి పేరు
వొందిన విద్యార్థులలో వరదయ్య ఒకరు.

౧౦
.................................


  కులపతి పూర్వగాథ                    11

లేఁబ్రాయమునుండి ఇంటివిద్యగా మన్నించుకొన్న సంస్కృతమే
ఆ క్లాసులో ప్రధానమై యుండుటఁజేసి పరీక్షలో అలవోకగా
విజయమందుటే కాదు; అధునాతన విద్యాప్రణాళికలో
అగ్రిమస్థానమందిన యమ్.ఏ. - ఆనర్స్ పరీక్షలో ప్రధమకక్ష్యలో
నెగ్గుట అగ్గింపవలసిన ఘట్టము.

ఆ చదువులలోఁ గానవచ్చిన విశిష్టమైన విజయముకన్న-
ఆయన వర్తన మత్యంతహృద్యమై వెలసినది.

రాజకీయముగా భారతీయులలో చైతన్య ముద్భవించి సాగిన
రోజులవి. విదేశములకు వలసవోయిన భారతీయుల మంచి
సెబ్బరలను బరిశీలించెడి నాథుఁడే ప్రపంచమున లేడు.
అస్వతంత్రమైన ఈ దేశమునకు వారి జోక్యము తీసికోవలెనన్న
బొత్తిగా అయితి కాదయ్యెను.

ఢిల్లీ కౌన్సిలులో గోపాలకృష్ణ గోఖలే చేసిన యాందోళనము
దేశములోఁ గొంత తెలిసెను. వలసలలో, విశిష్య - దక్షిణాఫ్రికాలో
జరిగెడి దురంతముల కంతు లేదు. అవి చూచిరమ్మని
ఇండియా ప్రభుత్వము ఇంగ్లాండునకు గోపాలకృష్ణ గోఖలేను
బంపెను. ప్రభుత్వము పెత్తనములో - ఆదేశమునకుఁ బోయిన
గోఖలేను దక్షిణాఫ్రికాప్రభుత్వము రాజదూతగా మన్నించి
సదుపాయములు కావించెదమని యేవేవో వాగ్దానములు
చేసెను. అప్పుడు గాంధీజీ అక్కడనేయుండి గోఖలేవెంట
ఆ దేశములోఁ దిరిగి భారతీయుల కష్టసుఖములను
బూస గ్రుచ్చినట్టులు బోధించెను. గోఖలే యిండియాకు
వచ్చినపిదప ఎన్నాళ్ళకును దక్షిణాఫ్రికాలో

౧౧
................................ 



 కులపతి పూర్వగాథ                  12

వాగ్దానములు మన్నింపలేదు. అక్కడ గాంధీజీ సత్యా
గ్రహమే ప్రారంభించెను. ఆ‘నినాద’ మీదేశములో గోఖలే
వినిపించి సత్యాగ్రహ బాధితులను మన మెల్లర మాదరింప
వలెనని హెచ్చరించెను. చెన్నపురిలో - కాలేజీపిల్లలుసైతము
చందాల కుపక్రమించిరి. రాజధానీకళాశాలలో ఉపన్యాసములు
జరిగినవి. విద్యార్థులు వేసిన చందాలలో - అయిదు
రూపాయలు  చిన్నపద్దుగాను బదునాఱు   రూపాయలు
పెద్ద పద్దుగాను అందఱు భావించెడి యా సందడిలో -
ఏదో యొకమూలఁ గూరుచున్న యొకానొక విద్యార్థి
అయిదువందల రూప్యముల  యంకె వేసెను. సభలో
గుసగుసలు వోయిరి. ఎవ్వ రా విద్యార్థియని యెల్లవారు-
అఱ్ఱు లెత్తి నల్గడ కలయఁ జూచిరి. ఆయన యెవ్వరో కాదు;
చిట్టిగూడూరునుండి వచ్చిన వరదాచార్యులవారే వారు.
ఆ వేషభాషలతో నిరాడంబర జీవికతో నివుఱు గప్పిన
నిప్పువోలె ఎవ్వరికంటికి రాక ఒదిగియున్న యీ వ్యక్తిలో
ఇట్టివిశేష మున్నదాయని సహాధ్యాయులు నివ్వెఱవోయిరి.
అధ్యాపకు లాశ్చర్యపడిరి. ఇక్కడ రెండు వింతలు.
అన్నాళ్ళు కాలేజిలోఁ గలసిమెలసియున్నను - ఇంటిలో
ఆయన కున్న సిరిసంపద లెట్టివో - ఆ గుండెలోఁ
గరడుగట్టి మకాము వెట్టిన యా కారుణ్య మెట్టిదో యప్పటికిఁ
గాని సహాధ్యాయులకే యర్థము కాలేదు. వెంటనే యా
మొత్తమును - తంతిమూలమునఁ దెప్పించి వారి
కర్పించి తన వదాన్యతనే గాక జాతీయదృష్టినే గాక
దయార్ద్ర భావమును సైత మా లేతవయస్సులో నిరూపించెను.

౧౨


.................................. 


కులపతి పూర్వగాథ                     13

మేనల్లునకు బిడ్డ నిచ్చి యొక యింటివానిని జేయు
టయేగాక - ఆయనకు రంగరామానుజాచార్యు లాదిలో
సాహిత్యగురువయ్యెను. ఆవల మహోద్దండపండితులైన
శ్రీమాన్ కాండూరి తాండవకృష్ణమాచార్యులవారిని దమ
యింటిలోఁ బెట్టుకొని వరదాచార్యులు శాస్త్రములు
చక్కఁగాఁ జదువుకొనెను.

అందచందములు గలిగియు జవ్వనపు మిసిమిలో తొణి
కిసలాడియు - అసిధారావ్రతమువంటి నిత్య దినచర్యను
బాటించెనన్న - ఆయన ప్రకృతి పరీక్షింపవలెను. చేతిలో
నిండుగా ధన ముండియు సర్వశాస్త్రములు క్షుణ్ణముగా
అభ్యసించియు సంస్కృతాంగ్ల సాహిత్యములో లోఁతులు
తడవిచూచియు చెన్నపురీనివాసము చవి యెఱింగియు-
ఆడంబరమును రవ్వంతేని దరికి రానీయఁడాయెను. ఆ
దివ్యమూర్తిలో గర్వ గంధము లవలేశమైనను గానరాదు.
విద్యాయౌవనములలో-ఆభిజాత్యసంపదలలో ఏదియేని
ఒక్కటి యున్నను మానవున కనర్థములు పొరయించునని
శాస్త్రములు చెప్పును. ఈ నాలుగును  వరదాచార్యులలో
కేంద్రీకరించి యుండియు వివేకమునే పెంచినవి కాని
అనర్థమును మచ్చునకైన ఆపాదింపవయ్యెను. కాసు
వీసములు కర్చువెట్టి రేయుంబవలు ఆంగ్లభారతిని
ఆరాధించినవాఁడయ్యు గీర్వాణవాణీ పరివస్యలను
ఏమఱియుండలేదు. బడిలో-అంగభాషగా సాధించుకొన్న
సంస్కృతమే ఆయన జీవితములో ప్రధానాంగముగా
పరిఢవిల్లెను.


౧౩

.............................................................................
...........................................................................